"అర్జున్ రెడ్డి" సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న జంట "విజయ్ దేవరకొండ-శాలినీ పాండే". ఈ సినిమా ఇద్దరికీ ఒక్కసారిగా స్టార్ డం ని తెచ్చిపెట్టింది. ఈ ఇద్దరు చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. కాలేజీ స్టూడెంట్స్ కి అయితే ఎక్కడ చూసిన "అర్జున్ రెడ్డి" ఫీవరే. 


అప్పటి నుంచి ఈ జంట మళ్ళీ ఎప్పుడు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని యూత్ బాగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళ కోరిక తీరబోతోంది. మరోసారి విజయ్ దేవరకొండ- శాలినీ పాండే కలిసి నటించబోతున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. అంతేకాదు ఈ సినిమాను మూడు భాషల్లో తెరకెకించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మాళవికా మోహన్ నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ-రష్మిక మండన్న జంటగా నటించిన "డియర్ కామ్రేడ్" జూలై లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విజయ్-రష్మిక "డియర్ కామ్రేడ్" తో మరో హిట్ కొట్టబోతున్నారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: