ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు వారసులుగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లోకి మరో వారసుడు హీరోగా వస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి  పెళ్ళి చూపులు చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు.

చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాత‌గా రాజ్‌కందుకూరికి మంచి పేరుంది. ఆయన తన తనయుడు శివ కందుకూరిని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. భరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, గతంలో కాజల్ కి మేనేజర్ గా పనిచేసిన 'రాన్సన్' నిర్మిస్తున్నారు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.


ఈ చిత్రానికి కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: