గతంలో వినాయక్-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన "కృష్ణ" కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొంది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో సినిమా చాలా సార్లు అనుకున్నప్పటికి అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్  పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ కాంబినేషన్ సెట్టయింది. ప్రస్తుతం రవితేజ "డిస్కోరాజా" అనే సినిమాలో  నటిస్తున్నాడు. ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఆర్.ఎక్స్.100 ఫేం "పాయల్ రాజ్ పుత్" రవితేజ కి జోడీగా నటిస్తోంది. "అమర్ అక్బర్ ఆంటోని" ఫ్లాప్ తో రవి తేజ ఎంతో డిసప్పాయింట్‌మెంట్ తో ఉన్నప్పటికి తనకున్న క్రేజ్ వల్ల వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. "ఆర్.ఎక్స్.100" తో టాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి తో కూడా రవితేజ సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. 
ఇక గత కొంతకాలంగా వినాయక్.. నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడాని సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి ) నిర్మాతగా రవితేజ హీరోగా సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. ఇంతక ముందు రవితేజ హీరోగా బుజ్జి "టచ్ చేసి చూడు" సినిమా నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ వినాయక్-రవితేజ్ కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, మిగతా విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: