కమలహాసన్ సినీ కెరియర్లో చెప్పుకోదగిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో 'దేవర్ మగన్' ఒకటి. ఈ సినిమాలో కమల్ నటనను గెటప్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. 1992లో కోలీవుడ్‌లో  విడుదలైన 'దేవర్ మగన్' సంచలన విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో 'క్షత్రియపుత్రుడు' పేరుతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడిదే సినిమాకి సీక్వెల్ చేయడానికి కమల్ రంగం సిద్దం చేసుకుంటున్నాడని తాజాగా వచ్చిన వార్త. 


'క్షత్రియపుత్రుడు' సినిమాలో కమల్ కి జోడీగా రేవతి, గౌతమీ నటించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. ఇక కమల్ హాసన్, చంద్ర హాసన్ నిర్మించారు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నాడు. కానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఎందుకనో ఆగిపోయినట్టు సమాచారం. అందుకే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా  'క్షత్రియపుత్రుడు' సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట కమల్.


అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ ను పొల్లాచ్చి లో ఆరంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. 'భారతీయుడు 2' ప్రాజెక్టు ఆగిపోవడం వల్లనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: