సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మే 9న రిలీజైన సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.


మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 4 రోజుల్లో ఏపి/తెలంగాణలో 47.60 కోట్ల షేర్ రాబట్టింది. అన్ని ఏరియాల్లో మొదటి రోజుతో సమానంగా వసూళ్లు సాధిస్తుంది మహర్షి. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ కలక్షన్స్ చూస్తే..


నైజాం : 16.61 కోట్లు 
సీడెడ్ : 5.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.55 కోట్లు
ఈస్ట్ : 4.86 కోట్లు
వెస్ట్ : 3.73 కోట్లు
గుంటూరు : 5.90 కోట్లు
నెల్లూరు : 1.71 కోట్లు
ఏపి/తెలంగాణ : 47. 58 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: