సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మే 9న రిలీజైన ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా 4 రోజుల్లోనే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 50 కోట్ల మార్క్ రీచ్ అయ్యింది.


ఇదిలాఉంటే ఆదివారం జరిగిన మహర్షి సక్సెస్ మీట్ లో మహేష్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. అంతేకాదు మహేష్ మాటల్లో కొన్ని పొరపాట్లు కూడా దొర్లాయి. చేసిన సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకు పనిచేసిన టీం ను మెచ్చుకోవడం మంచి విషయమే కాని గతాన్ని మర్చిపోవడం మాత్రం తప్పు. 


అలానే సినిమా హిట్టైన ఎక్సైట్మెంట్ లో మహేష్ మహర్షి మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ను ఆకాశానికెత్తేశాడు. సినిమాలో దేవి మ్యూజిక్ హైలెట్ అని.. పదరా పదరా సాంగ్.. ఇదే కదా ఇదే కదా సాంగ్ చాలా స్పెషల్ అని వాటిని వింటే గూస్ బమ్స్ వస్తాయని. సినిమా కథలో భాగమయ్యే మ్యూజిక్ ఇవ్వడంలో దేవి నంబర్ 1 అని చెబుతూ దేవి నువ్వు రియల్ రాక్ స్టార్ దేవి అంటే నాకు ప్రాణం అనేశాడు మహేష్. 


దేవి మ్యూజిక్ వరకు బాగుంది.. సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది అన్నంతవరకు ఓకే కాని ఈ ఒక్క సినిమాకు దేవి నాకు ప్రాణం అని చెప్పడం కాత అతిగానే అనిపించింది. హిట్టైన ప్రతి సినిమా టెక్నిషియన్స్ కు పొగిడే హీరోలు ఇలానే ఆ టెక్నిహ్షియన్స్ కు సపోర్ట్ గా మాట్లాడినా ప్రేక్షకులు మాత్రం వాటిని తిప్పికొడుతుంటారు. మహర్షి సినిమా విషయానికొస్తే దేవి అంతగా చేసిందేమి లేదు.. అయితే మహేష్ చెప్పిన ఆ రెండు పాటలు మాత్రం హైలెట్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: