దిశా ప‌టాని.. స‌ల్మాన్ ఖాన్ భ‌ర‌త్ సినిమాలో అందరి దృష్టిని ఆక‌ర్షించిన న‌టి. తాను చేసే సినిమాల్లో ఆమె ఒక ఆకర్ష‌ణ‌గా నిలువ‌లనేది ఆమె గ‌తంలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుటు ఆమె అనుకున్న‌ట్లుగానే భ‌ర‌త్‌లో ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి అంద‌రిలో క‌లిగిస్తుంది. 


అయితే ఈ అమ్మ‌డు లోఫ‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైంది. అయితే తొలి సినిమానే నిరాశ‌ప‌ర్చ‌డంతో బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. ఆశించిన‌ట్టుగానే అక్క‌డ అవ‌కాశాలు బోలెడు వచ్చాయి. ఎంఎస్ ధోనీ, అన్‌టోల్డ్ స్టోరీ, కుంగ్ ఫూ యోగా లాంటి సినిమాల్లో నాయిక‌గా న‌టించింది.  ఈ సినిమాలు త‌న‌కు హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పేరుతెచ్చిపెట్టింది. 


భాగీ 2 సూప‌ర్ హిట్ సాష‌ధించి స్టార్ హీరోయిన్ ను చేసింది. ఈ సినిమా త‌ర్వాత అగ్ర క‌థానాయ‌కులు ఆమెకు అవ‌కాశాలు ఇస్తున్నారు. త‌న న‌ట ప్ర‌యాణం జోరుమీదున్న సంద‌ర్భంగా నిల‌క‌డ‌గానే ఉంటాన‌ని చెప్పుకొచ్చింది దిశా. 


ప్ర‌తి హీరోయిన్ల మాదిరిగానే తాను బ‌ల‌మైన పాత్ర‌లు చేయాల‌ని అనుకుంటున్నాని చెప్పారు. న‌ట ప్ర‌యాణంలో నేను ఇంకా కొత్త‌నే అని చెప్పారు. అందుకే అద్భుత‌మైన అవ‌కాశాల కోసం ఆశించ‌డం లేద‌ని వెల్ల‌డించింది. కొత్త‌గా ఉండి ప్రేక్ష‌కులు గుర్తుంచుకునే పాత్ర‌లు చేస్తే చాల‌ని చెప్పుకొచ్చింది దిశా.


మరింత సమాచారం తెలుసుకోండి: