యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తరువాత వీపరితమైన క్రేజు పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇంక టాలీవుడ్ లో అయితే బాహుబలి నాన్ బాహుబలి రికార్డులుగా ప్రతి సినిమా రికార్డును పరిగణిస్తున్నారు. ఇదో కొలమానంగా మారిపోయింది. ప్రభాస్ కు మొదటి నుండే ఫ్యాన్ ఫాలోయింగ్ చాల పెద్ద ఏత్తునే ఉంది. ఇంక బాహుబలి తరువాత అది ఇంకా పెరిగింది.

 

బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, జాన్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. సాహో సినిమాకి ఇప్పటికి చాల హైప్ వచ్చింది. ఆడియన్స్ తమ అభిమాన హీరోని ఏప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఆశతో ఏదురుచుస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం ఆగష్టు 15వ తేదిన విడుదల కానుంది. ఈ సినిమాలో కొన్ని జాతీయ భావాలను తెరకెక్కించినట్లు వినికిడి.

 

ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. శ్రద్దా కపూర్ ప్రభాస్ కు జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇదిలా ఉండగా ప్రభాస్ రీసెంట్ గా తన మిత్రులతో కలసి ఒక ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ను మొదలు పెట్టాలని అనుకున్నాడట. దానికి కావలసివన్నీ రెడీ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వినికిడి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి ఈ ఛానల్ ను మొదలపెడుతున్నట్లు సమచారం.

 

ఇప్పటికే ఈ ఛానల్ కు సంబంధించిన లైసెన్స్ లు అన్నీ కుడా రెడీ అయ్యయంట. ఇంక ఈ ఛానల్ ను జూన్ 24వ తేదిన లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన డైరెక్టర్ లు సుజీత్, రాధాకృష్ణలు కూడా ఈ ఛానల్ లో పార్టనర్ షిప్ ఉన్నట్లు వినికిడి. మొత్తానికి డార్లింగ్ ఛానల్ ఏలా ఉంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: