గ‌తంలో వ‌చ్చిన బాల‌య్య బోయ‌పాటి చిత్రాలు ఎన్నో విజ‌యం సాధించాయి. వీరిరువురి కలయికలో మరో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రానికి దర్శకుడు 60 కోట్ల బడ్జెట్ ఇచ్చార‌ని, అయితే బాలయ్య మాత్రం 40 కోట్ల బడ్జెట్ లోనే సినిమా చేయాలని సూచించడంతో ఆ కథను పక్కన పెట్టేశారు బోయ‌పాటి. దాంతో బాల‌య్య కోసం మరో కథను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఈ కథ బాలయ్యకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశార‌ట.
ప్ర‌స్తుతం వ‌స్తున్న చిత్రాలన్నీ ఎక్కువ‌గా బ‌డ్జెజ్‌కి ప్రాధాన్య‌త‌ని ఇస్తున్నాయి. ఎంత ఎక్కువ బ‌డ్జెట్ ఉంటే అంత గొప్ప‌గా ఫీల‌వుతున్నారు కొంద‌రు. క‌థ‌లో బ‌లం ఉన్నా లేక‌పోయినా బ‌డ్జెట్ ఎక్కువ‌గా పెట్టేసి ముందునుంచే సినిమా పై ఓ హైప్‌ని క్రియేట్ చేయ‌డం ప్ర‌స్తుతం ట్రెండ్‌గా మారింది. మ‌రి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన రాంచ‌ర‌ణ్ హీరోగా విన‌య‌విధేయ‌రామ అంత‌గా హిట్ కాలేక‌పోయింది. బోయ‌పాటి అంటే మాస్ ఆడియ‌న్స్‌ని  ఎలాగైనా మెప్పిస్తాడ‌నే టాక్ ఉంది. కాని ఆ చిత్రంలో ఆ మంత్రం ప‌నిచేయ‌లేదు. మ‌రి ఇప్పుడు బాల‌య్య చిత్రం ఎలా ఉండ‌బోతుందో ఆయ‌న‌కి  చెప్పిన క‌థ‌లో అంత‌గా న‌చ్చిన అంశ‌మేంటో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: