నిధి అగర్వాల్ లేటెస్ట్ బ్యూటి. మోడల్గా కెరీర్ ప్రారంభించిన నిధి…మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ తర్వాత తెలుగులో మిస్టర్ మజ్ను చిత్రంతో అడుగుపెట్టింది. సవ్యసాచి ఆమె రెండో చిత్రం కాగా…ప్రస్తుతం ఇస్మాట్ శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఈ ముద్దు గుమ్మకు అందంతో పాటు తెలివి కూడా ఎక్కువే. మీడియాను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన భామ.
తాజగా నిధిని అబ్బాయిల ఆకర్షణలో పడిపోతారా అని అడిగితే…సినిమాల్లోని పాత్రల్లా బయట ప్రవర్తిస్తామా అని చురుకైన సమాధానమిస్తోంది. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు, రెండింటికీ ముడు పెట్టవద్దు అంటూ గట్టిగా హెచ్చరిస్తోంది. సినిమాలో పాత్రను బట్టి మాత్రమే అలా నటిస్తాము తప్ప తమకూ ఓ వ్యక్తిత్వం ఉందని ఆమె ఘాటైన ఆన్సర్ ఇస్తోంది.
ఇదిలా తనకు ఏ పాత్ర అయినా ఇష్టమేనని నిధి గడుసుగా జవాబు చెబుతోంది. వచ్చిన పాత్రను చేయడమే తన ముందు ఉన్న బాధ్యత అంటోంది. ప్రేమ కధా చిత్రాల్లో నాయికకు నటించేందుకు స్కోప్ ఉంటుంది, యాక్షన్ మూవీస్ లో ఉండదు అయినా సినిమాను ఒప్పుకుంటే ఏదైనా నటించి తీరాల్సిందేనని తెలివిగా చెబుతోంది. నాలుగు కాలాల పాటు నటించే అందం చందం నిధి నిక్షేపాలుగా ఉన్న ఈ అమ్మడుకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువే. సొ టాలీవుడ్ నే కాదు ఏ వుడ్ ని అయినా ఇట్టే అల్లుకుపోగలదని అంటున్నారు.