ప్రస్తుతం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి 'భారత రత్న' ఎపీజే అబ్దుల్ కలామ్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. టాలీవుడ్ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్.. అనిల్ సుంకర ఈ బయోపిక్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట.


 ఈ సినిమాలో కలామ్ పాత్రకు సీనియర్ బాలీవుడ్ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ పరేష్ రావల్ ను ఎంచుకున్నారని లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం పరేష్ రావల్ తో చర్చలు సాగుతున్నాయని సమాచారం.  ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టి దర్శకుడిగా మారుతున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ ను జూన్ లో మొదలుపెడతారని సమాచారం.

రాజ్ చెంగప్ప రచించిన కలామ్ బయోగ్రఫీ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తారట. భారత దేశంలో కులమతాలకు.. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి అబ్దుల్ కలామ్. ఆయన జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం .  అలాంటి కలామ్ గారి బయోపిక్ ను ప్లాన్ చేయడం గర్వించదగ్గ విషయమని ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: