టైటిల్ చూసి మీకు మ్యాటర్ అర్ధమై ఉండొచ్చు.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు ఇద్దరే.. తమ స్టార్ డం కొనసాగిస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ దుందుంభి మోగిస్తున్న హీరోలు వారు. ఒక్కొక్కరిగా రికార్డులు బద్ధలు కొట్టే స్టామినా ఉన్న వారిద్దరు కలిసి ఒకే సినిమా చేస్తే.. అబ్బో అది మరీ అరాచకమే.


అలాంటి ఆలోచనే వచ్చింది రాజమౌళికి. బాహుబలి తర్వాత ఆ సినిమాను మించేలా చేయాలన్ని ఆర్.ఆర్.ఆర్ సెట్ చేసాడు అందులో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు హీరోలను ఎనౌన్స్ చేశాడు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.


ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా అవుట్ పుట్ మీద చిత్రయూనిట్ ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉందట. మరోసారి రాజమౌళి తప్పకుండా బాహుబలి రేంజ్ రికార్డులు సాధిస్తారని అంటున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


చరణ్, తారక్ ఇద్దరు మంచి ఫాం లో ఉన్న స్టార్ హీరోలు.. వాళ్లిద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తేనే అదిరిపోద్ది అనుకుంటే ఇద్దరు ఒకే తెరపై స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అభిమానులకు పెద్ద పండుగ. అయితే వారిద్దరి మధ్య స్నేహం కూడా ఈ సినిమా ఓకే అయ్యేందుకు ఉపయోగపడ్డది. మరి ఆర్.ఆర్.ఆర్ సంచలనాలు ఎలా ఉంటాయన్నది మాత్రం రిలీజ్ తర్వాతే చెప్పగలం.



మరింత సమాచారం తెలుసుకోండి: