మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ వంశీ పైడిపల్లి మీద ఇప్పుడు అందరి నిర్మాతల దృష్టి పడ్డది. కమర్షియల్ సినిమానే సోషల్ మెసేజ్ తో చెప్పడంలో ఇన్నాళ్లు కొరటాల శివ మాత్రమే చేయగలడు అనుకున్నాం కాని మహర్షితో ఓ మంచి ప్రయత్నం చేసి ప్రేక్షకులను మెప్పించాడు వంశీ పైడిపల్లి.


మహర్షి డైరక్టర్ గా వంశీ పైడిపల్లికి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా హిట్ తో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే వంశీ పైడిపల్లి తర్వాత చేసే సినిమా ఏంటి..? సినిమా ఏ హీరోతో చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మహర్షితో మహేష్ ను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి తన తర్వాత సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేస్తాడని తెలుస్తుంది.


ఆల్రెడీ రాం చరణ్ తో వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎవడు సినిమా వచ్చింది. ఆ సినిమా హిట్ గా నిలిచింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లోనే సినిమా చేస్తాడని అంటున్నారు. దిల్ రాజే ఈ సినిమాను నిర్మిస్తారని టాక్.


ఏది ఏమైనా తను చేసే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నా కమర్షియల్ గా కాస్త వెనుకపడి ఉండే వంశీ పైడిపల్లి ఫైనల్ గా మహర్షి సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. వంశీ కెరియర్ లోనే కాదు సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో కూడా మహర్షి ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది. వసూళ్లు కూడా బాగుండటంతో సినిమా మహేష్ 25వ సినిమాగా పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: