ఇండియన్ ఫిలిం సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ డ్రామా…ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కొంతమేర ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది.
అయితే గతంలో జరిగిన షూటింగ్ సమయంలో చరణ్ , ఎన్టీఆర్ వేర్వేరు సందర్భాలలో గాయపడటం మనకందరికీ తెలిసినదే. అయితే సినిమాకి సంబంధించిన ఇద్దరు హీరోలు గాయపడటంతో ఆగిపోయిన షూటింగ్ తాజాగా మొదలైన. ఇద్దరు హీరో లు గాయాల నుండి కోలుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాజాగా కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి ప్రారంభించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం.
హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ షెడ్యూల్ జరగనున్నట్టు టాక్. అంతేకాదు… ఈ షెడ్యూల్లో కథానాయిక అలియా భట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ ఆర్ ఆర్కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. డి.వి.వి.దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ… వచ్చే ఏడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా నేపథ్యంలో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి.