సాధారణంగా ఎవరికైనా ఒక సినిమా కమిటయ్యేటప్పుడు..ముందు చెప్పినట్టుగా తర్వాత జరగలేదని చాలా మంది వాపోతుంటారు. ఇది టెక్నీషియన్స్ దగ్గర్నుంచి మొదలుకొని హీరో హీరోయిన్స్ వరకు అందరి విషయంలో కామన్ గా జరుగుతుంటుంది. ఇంక క్లియర్‌గా చెప్పాలంటే హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా జరుగుతుందనడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. పేమెంట్స్, సీన్స్, ఎక్స్‌ఫోజింగ్ ఇలా చాలా విషయాల్లో కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన హీరోయిన్స్ దగ్గర్నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరు ఫేస్ చేస్తున్నారు అలాంటి ఒక సంఘటనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విషయంలోను జరిగింది. 


తమిళ సినిమాల్లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్.. బుల్లి తెరపై యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి మెల్ల మెల్లగా కెరీర్ లో స్టార్ డంను దక్కించుకుంది. తమిళంలో స్టార్స్ తో నటించిన ఐశ్వర్య.. అతి త్వరలో విజయ్ దేవరకొండతో జత కట్టడానికి సిద్దం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండకు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.


అయితే గతంలో తాను నటించిన 'సామి 2' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి చేసిన 'సామి 2' ను ముందు చేయాలనుకోలేదట. కానీ తన సన్నిహితుల బలవంతం తో ఈ సినిమాను ఒప్పుకుందట. అయితే దర్శకుడు ముందు కథ చెప్పినట్టుగా ఆ తరవాత తనకు సినిమాలో ప్రాధాన్యం లేదని ఈ విషయంలో తనకు ఇప్పటీ సాటిస్ ఫ్యాక్షన్ లేదని తెలిపింది. ఈ విషయంలో దర్శకుడి చేతిలో మోసపోయానని మరో సారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నానని తన బాధను వ్యక్తం చేసింది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: