ఇప్పటివరకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నటించిన హీరోలెవ్వరు విలన్ గా టర్న్ తీసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే పూరీ సినిమాలో హీరోగా నటించిన హీరోలందరు ఒక స్టార్ డం ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో సెటిలై పోయారు. అయితే కొన్నేళ్ళ క్రితం పూరీ పరిచయం చేసిన ఇషాన్ మాత్రం హీరోగా రెండవ సినిమా చేయనేలేదు. కనీసం ఒక క్యారెక్టర్ కూడా ఏ సినిమాలో అవకాశం రాలేదు. రోగ్ సినిమాతో పూరీ పరిచయం చేసిన ఇషాన్ ఇప్పుడు విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడని సమాచారం.
ప్రస్తుతం టాలీవుడ్ లో మన యంగ్ హీరోస్ ట్రెండ్ కు తగ్గట్టుగా మారుతున్నారు. క్యారెక్టర్ నచ్చాలేగానీ విలన్ గా నటించడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఒకరకంగా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకీ మంచే అని చెప్పాలి. విలన్స్ కోసం పరభాషా నటుల పైన ఆధారపడకుండా ఉండొచ్చు . ఇక మన కుర్ర హీరోలందరూ కథ బావుంటే గ్రేషేడ్స్లో కూడా నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. అందుకు ఉదాహరణ నాని. తన 25వ చిత్రం 'వి' లో నెగటివ్ షేడ్స్లో నటిస్తాడని సమాచారం.. అలాగే మరో యువ కథానాయకుడు నవీన్ చంద్ర .. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో నెగటివ్ షేడ్స్లో నటించాడు.
అల్లరి నరేష్, ఆది పినిశెట్టి, నవదీప్ కూడా గ్రేషేడ్స్లో మెప్పించారు. ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా విలన్గా నటిస్తున్నాడు. ఇలా చాలా మంది కుర్ర హీరోలు కథానుగుణంగా పాత్రలు చేయడానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ లిస్టులో ఇషాన్ కూడా జాయిన్ అవుతున్నాడట. ఆర్.ఎక్స్.100 ని తెరకెక్కించిన అజయ్ భూపతి త్వరలోనే రవితేజతో 'మహా సముద్రం' అనే సినిమాను డైరెక్ట్ చేస్తాడని టాక్. ఈ సినిమాలో ఇషాన్ను విలన్గా నటింప చేస్తారని లేటెస్ట్ అప్డేట్. ఇక ప్రస్తుతం రవి తేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ్ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.