'డాలర్ డ్రీంస్' అనే సినిమా తీసినప్పుడు శేఖర్ కమ్ముల ఎవరో అంతగా ఎవరికీ తెలీదు కానీ అదే శేఖర్ కమ్ముల 'ఆనంద్' అనే సినిమా తీయగానే ఇండస్ట్రీ మొత్తం ఆరా తీసింది. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి క్లాసిక్ ని తీసే డైరెక్టర్ ఉన్నాడా అని. అంతగా శేఖర్ అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ , లీడర్ వంటి సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని తీసుకు వచ్చాయి. ఇక 'ఫిదా' మాత్రం శేఖర్ కమ్ముల కు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పక తప్పదు. ఈ సినిమా తర్వాత శేఖర్ మళ్ళీ ఏ స్టార్ తో సినిమా చేస్తాడోనని అందరు అనుకున్నారు. 


కానీ ఇంతవరకు శేఖర్ నుండి ఏ సినిమాకు సంబందించిన వార్త రాలేదు. మరి ఎక్కడున్నారు శేఖర్ కమ్ముల...! అంటే ప్రస్తుతం కమ్ముల తన సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళుతున్నారని తెలుస్తోంది. జూన్ మొదటి వారం నుంచి అక్కడ ఖరీదైన ఎగ్జోటిక్ లొకేషన్లలో షూటింగ్ చేస్తారట. అంతా నూతన నటీనటులతో తెరకెక్కుతున్న సినిమా అట. ఎప్పటిలానే అందరికీ నటనపరంగా ప్రీప్రిపరేషన్ చేశారని తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.  


జూన్ మొదటి వారం నుంచి దుబాయ్ లోనే చిత్రయూనిట్ బిజీగా ఉంటుందట. అక్కడ అరుదైన లొకేషన్లలో కీ సీన్స్  ప్లాన్ చేశారు. అటుపై హైదరాబాద్ లో షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి శేఖర్ కమ్ముల తన స్టైల్ లోనే మళ్ళీ హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి మరో యూత్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నరనమాట. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: