'క్షణం' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అడవి శేష్...ఏం చేస్తున్నాడని అందరు అనుకున్నారు. క్షణం కి సీక్వెల్ తీస్తున్నారని కొందరు..లేదు వేరే కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడని కొందరు..ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనేసుకున్నారు. ఆ మధ్య జీవిత రాజశేఖర్ కుమార్తెను హీరోయిన్‌గా లాంచ్ చేస్తూ ఒక సినిమా మొదలైంది.
ఆ సినిమాలో హీరోగా అడవి శేష్ నటిస్తున్నాడు. అయితే కారణాలు తెలీలేదు గానీ ఆ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా ఆగిపోలేదని జీవిత క్లారిటీ ఇచ్చారు. 


ఇదిలా ఉంటే రీసెంట్‌గా అడవి శేష్ అందరికి షాకిచ్చాడు. అసలు ఏమాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఒక సినిమాని కంప్లీట్ చేశాడని లేటెస్ట్ న్యూస్. పివిపి ప్రొడక్షన్ లో 
రెజీనా హీరోయిన్ గా థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో ఒక సినిమాని ఫినిష్ చేశాడు. ఒకవైపు సినిమాకు ప్రమోషనన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ ఓపెనింగ్ మొదలుకొని సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకునే వరకూ మీడియాలో ప్రమోట్ అవుతుంటే తప్ప ప్రేక్షకులు ఆ సినిమాని గుర్తు పెట్టునే ప్రస్తుత పరిస్థితి.. అలాంటిది గుట్టు చప్పుడు కాకుండా ఏ అప్ డేట్ ఇవ్వకుండా అడవి శేష్ సినిమా కంప్లీట్ చేయడం నిజంగా సాహసం అని చెప్పాలి.


ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఒకేసారి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నాడట అడవి శేష్. ఈ ప్లాన్ ప్రకారమే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వలేదట. ఇక థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ గట్టి హిట్ కొట్టబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోందట.
 



మరింత సమాచారం తెలుసుకోండి: