డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా స్టార్స్ నటించిన సినిమాలకు అద్భుతమైన మాటలను అందించారు. అంతేకాదు వరుణ్ తేజ్ వంటి యంగ్ స్టర్స్ కి కూడా 'కంచె' లాంటి సినిమాలో ఎంతో పవర్‌ఫుల్ డైలాగ్స్ ని రాశారు. ఒకేసారి టాలీవుడ్ లో ఇద్దరు పెద్ద హీరోలు నటించిన 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలకి ఒకేసారి తూటాల్లాంటి మాటలను రాసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ మాటల రచయిత త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.


డైలాగ్ రైటర్ గా కంటే స్టార్ డైరెక్టర్ గా కొరటాల శివ ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక 'సైరా' తర్వాత మెగాస్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు శివ. అయితే ఈ స్థాయికి రావడానికి మాత్రం యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' అని మాత్రం చాలా తక్కువ మందికి గుర్తుంది. ఎందుకంటే డైలాగ్ రైటర్ గా ఉన్న కొరటాల శివకు డైరెక్టర్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ ఇచ్చిన అవకాశంతో శివ ఈరోజు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ మరో రైటర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని లేటెస్ట్ న్యూస్.


మాటల ద్వారా భావాలను అద్భుతంగా పలికిస్తారని పేరు తెచ్చుకున్న బుర్రా సాయి మాధవ్ 'కంచె' నుంచి 'ఎన్టీఆర్' దాకా ప్రతి సినిమాలోనూ తూటాల్లాంటి సంభాషణలు రాశారు. శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 ఒకే టైంలో ఇద్దరు అగ్ర హీరోలకు అదిరిపోయే మాటలు అందించడం ఆయనకే చెల్లింది. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమాతో సాయి మాధవ్ డైరెక్టర్‌గా మారబోతున్నారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: