ఉయ్యాలా..జంపాలా, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మావా, వంటి సినిమాలతో యంగ్ హీరో రాజ్ తరుణ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అంతేకాదు అమ్మాయిల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో అంతా రివర్స్ అయిపోయింది. గత సంవత్సరం వరుసగా మూడు డిజాస్టర్లతో ఒక్కసారిగా పాతాళానికి పోయాడు ఈ యంగ్ హీరో. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అందుకు కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒక అవకాశం దక్కించుకున్నాడు కాబట్టి. 


ఈ అవకాశం రాగానే ఊపిరి పీల్చుకున్న రాజ్ తరుణ్ మెల్లగా ఒక్కో సినిమాని చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాతో ఇంకో కొత్త సినిమాని ఒప్పుకున్నట్లు సమాచారం. నితిన్ తో 'గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' తీసిన విజయ్ కుమార్ కొండా చెప్పిన కథకు ఓకే చెప్పాడట రాజ్ తరుణ్.


విజయ్ కుమార్ కొండా గతంలో తీసిన రెండు సినిమాలు లవ్ స్టోరీసే. అంతేకాదు ఇప్పుడు రాజ్ తరుణ్ తో చేయబోయేది కూడా లవ్ స్టోరీనే అని టాక్. తనకన్నా వయసులో పెద్దయిన అమ్మాయితో ప్రేమలో పడే యువకుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్య మీనన్ పేరును పరిశీలిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇక ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో 'ఇద్దరి లోకం' ఒకటే చేస్తున్న రాజ్ తరుణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనట. 


మరింత సమాచారం తెలుసుకోండి: