సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి, ఇప్పటికీ తన కలెక్షన్ల హవా కొనసాగిస్తోంది అనే చెప్పాలి. నిజానికి మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి, ఆ టాక్ మెల్లగా పుంజుకుని, విపరీతమైన ప్రేక్షక అభిమానం మరియు కలెక్షన్లతో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ రేంజికి చేరుతోంది. ఇకపోతే ఇప్పటికే దాదాపుగా విడుదలైన చాలా చోట్ల మహర్షి సేఫ్ జోన్ కి చేరుకున్నాడు. 

అంతేకాదు మరికొన్ని చోట్ల అయితే ఏకంగా మంచి లాభాలనే తెచ్చిపెడుతున్నాడు. అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ చేరడం కొంత కష్టం అయినప్పటికీ, సినిమా క్లోసింగ్ సమయానికి వాటిని కూడా అందుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఇప్పటికే విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, మొత్తం పదిహేను రోజులకు గాను తెలంగాణ మరియు ఏపీలో రూ.72 కోట్లు, తమిళనాడు రూ.2.50 కోట్లు, కర్ణాటక రూ.9.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.80 కోట్లు, ఓవర్సీస్ రూ.12.64 కోట్లు, వెరసి మొత్తం రూ.98 కోట్ల షేర్ కు చేరుకుంది. ఇక గ్రాస్ కలెక్షన్ల పరంగా ఈ సినిమా రూ.182.12 కోట్లు కలెక్ట్ చేసిందట. ఇక దీనిని బట్టి చూస్తే ఈ సినిమా రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల షేర్ మార్క్ చేరుకోవడం పెద్దగా కష్టం ఏమి కాదని అర్ధం అవుతోంది. 

నిజానికి ఈ సినిమాకు ఇంతటి అద్భుతమైన కలెక్షన్లు రావడానికి కారణం సినిమాలో మంచి కథ, కథనాలు ఉండడమేనని, ఈ రోజున ఈ సినిమా ఇన్ని రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతుంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టామినా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కెరీర్ లో చాలా ఏళ్ల క్రితం హిట్ వెంట హిట్ కొట్టిన మహేష్ బాబు, మళ్ళి ఇన్నేళ్ల తరువాత వరుసగా రెండు హిట్స్ ని ఇచ్చి అయన ఫ్యాన్స్ ని ఖుషి చేశారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: