తెలుగు టెలివిజన్ ఛానల్ లో గత ఆరు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంతో మంది నటులు వచ్చారు..పోయారు.  కొంత మంది మాత్రం టీమ్ లీడర్ గా అలాగే కొనసాగుతున్నారు. జబర్ధస్త్  మంచి సక్సెస్ పొందిన నటులు ధన్ రాజ్, తాగుబోతు రమేష్, వేణు ఇలా ఎంతో మంది వెండి తెరపై తమ కామెడీ పండిస్తున్నారు. ఇక జబర్ధస్త్ బాగా పాపులర్ సంపాదించినవారిలో సుడిగాలి సుధీర్ ఒకరు.  ప్రస్తుతం సుధీర్ ఢీ ప్రోగ్రామ్ లో కూడా మంచి సత్తా చాటుతున్నారు.


ఆమద్య సుడిగాలి సుధీర, యంకర్ రష్మిపై ఎన్నో రూమర్లు వచ్చాయి..ఒకదశలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పుకార్లు వచ్చాయి..కానీ ఈ పుకార్లను ఇద్దరూ కొట్టి పడేశారు. తాజాగా ఈ నటుడు ఇప్పుడు హీరోగా మారాడు. గతంలో 'ఢీ' షోలో హీరో రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చే సుధీర్ ని జడ్జిలు కూడా హీరోగా మారమని సలహాలు ఇచ్చేవారు.సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు హీరోగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల అనే దర్శకుడు 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది.


ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ..జబర్ధస్త్ కామెడీ షో నాకు ఎంతో మంచి పేరు, స్టేటస్ ఇచ్చింది.  ఇక పోతే నన్ను చాలా మంది హీరో అంటున్నారు..కానీ వాస్తవానికి కథే ఇక్కడ హీరో అన్నారు. ఇంత తక్కువ సమయంలో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో వారికి మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: