జాతీయ స్థాయిలో ఎన్నో సంచలనాలు సృష్టించి అఖండ విజయం సాధించిన బాహబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘సాహూ’. యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  బాహుబలి 2 తో ప్రభాస్ రేంజ్ ప్రపంచ స్థాయిలో దుమ్మురేపింది.  దాంతో ప్రభాస్ నటించే తదుపరి సినిమా పై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.  


ప్రస్తుతం ‘సాహూ’మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది.  ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల వరకూ ఖర్చు చేశారట. తెలుగు, తమిళ,హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
ఈ మద్య ‘సాహూ’సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై దర్శకుడు సుజీత్ స్పందిస్తూ, "ఈ సినిమా షూటింగును పూర్తి చేసేశాము. అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు.  అందులోనూ ఈ సినిమాలో అతిధిపాత్రల్లో కనిపించే సన్నివేశాలు ఏవీ లేవని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు సుజిత్. 


మరింత సమాచారం తెలుసుకోండి: