టాలీవుడ్ లో ఈ మద్య బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మహానటి, యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాలు వచ్చాయి.  అయితే సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి మంచి సక్సెస్ సాధించింది.  మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చిత్రీకరించారు. 

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు..ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు రాలేదు.  అదే సమయంలో వైఎస్సాఆర్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి మహి.వి.రాఘవ దర్శకుడు. మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడట దర్శకుడు. నిన్న ఏపిలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహాప్రభంజనం సృష్టించారు.  అఖండి మెజార్టీతో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు.  వైఎస్ కన్న కలలు నెరవేర్చబోతున్నారు..ఇప్పుడు ఏపిలో ఎక్కడ చూసినా జగన మంత్రమే జపిస్తున్నారు.   

ఇక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ అమోఘమైన విజయం సాధించడంతో ఆయన పాదయాత్రను ‘యాత్ర 2’ పేరుతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ జగన్ కి శుభాకాంక్షలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: