నిధీ అగర్వాల్...సవ్యసాచి సినిమా అనౌన్స్ అయినదగ్గర్నుంచి రిలీజయ్యో వరకు ఈ అమ్మాయి గురించే మాట్లాడుకున్నారు ఇండస్ట్రీ అంతా. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కాబోతుందని. కానీ ఆ సినిమా రిలీజై డిజాస్టర్ అయ్యోసరికి అందరి అంచనాలు తారుమారయ్యాయి. అయితే అనూహ్యంగా అక్కినేని ఫ్యామిలీలోనే రెండో ఛాన్స్ అందుకొని అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞు లో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో నిధీ పరిస్థితి ఏంటీ అనుకునే లోపే పూరీ సినిమాలో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. 


నిజంగా నిధీ కి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్‌లోనే కాదు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఒక్క ఫ్లాప్ పడితే ఇక రెండో ఛాన్స్ ఉండదు. అదీ హీరోయిన్ గనక అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నిధీ కి రెండు ఫ్లాప్ లున్నా కూడా పూరీ.. రాం హీరోగా తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందుకు మేయిన్ రీజన్ నిధీ మంచి పర్ఫార్మర్, దానికి తోడు అందంగా ఉంటుంది. 


కాబట్టే నిధీ ఎంతో ధీమాగా ఉందట. నాకు ఎన్ని ఫ్లాపులొస్తే ఏంటీ నా గ్లామరే నాకు ప్లస్. అందుకే వరుసగా అవకాశాలొస్తున్నాయని ఫీలవుతుందట. దీనికి తోడు ఈ మధ్యే ఒక తమిళ సినిమాలోను సంతకం చేసింది. 'జయం' రవి 25వ సినిమాలో హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ ఎంపిక అయింది. తమిళంలో నిధీకి ఇదే తొలి సినిమా. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: