కంటిన్యూస్ గా లవ్ స్టోరీస్ తో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన డైరెక్టర్ తేజ వరుస ఫ్లాప్ లతో వెనకపడిపోయాడు. కానీ రెండేళ్ళ క్రితం వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేశాడు కానీ కుదరలేదు. ఆ తర్వాత బాలయ్యతో ఎన్.టి.ఆర్ షూటింగ్ మొదలైన తర్వాత ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. 


అయితే నేనే రాజు నేనే మంత్రి సినిమా టైం లోనే సీత కథ కాజల్ అగర్వాల్ కి చెప్పి ఇంప్రెస్ చేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు తీసినా హీరోయిన్ గా నేనే యాక్ట్ చేస్తానని కాజల్ తేజకు ప్రామిస్ చేసింది. అనుకున్నట్టుగానే కాజల్ హీరోయిన్ గా సీత ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు తేజ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సినిమా గురించి చాలా హైప్ క్రియోట్ చేశాడు. ఒక వేళ సినిమా నచ్చకపోతే తిట్టమని కూడా మీడియా సమావేశంలో ఓపెన్‌గా చెప్పాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు తేజ ఇంత కాన్‌ఫిడెంట్ ఉన్నాడంటే సినిమా సూపర్ హిట్ అనుకున్నారంతా. 


కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అసంతృప్తితో థియోటర్ నుండి బయటకు వస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్ సూపర్. విలన్ గా సోనూ సూద్ అల్టిమేట్. కానీ హీరోగా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తేజ రాంగ్ ఛాయిస్ అని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కాకుండా వేరే (శర్వానంద్, ఆది పినిశెట్టి) లాంటి వాళ్ళు గనకైతే మినిమం గ్యారెంటీ గా ఆడేదని..ఇది కేవలం డైరెక్టర్ చేసిన పొరపాటే అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారట.  



మరింత సమాచారం తెలుసుకోండి: