గత కొన్ని సంవత్సరాలుగా హిట్ పేయిర్ కాంబినేషన్ లో సినిమాలు కంటిన్యూస్ గా రావడం చాలా వరకు తగ్గిపోయింది. దాదాపు 20 ఏళ్ళ క్రితమైతే ఒకేసారి ఒకే హీరో హీరోయిన్ కలిసి నటించిన సినిమాలు ఒక సంవత్సరంలో దాదాపు 5-6 రిలీజయ్యేవి. కానీ ప్రస్త్యుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందుకు కారణాలు అనేకం. అయితే త్వరలో ఒకేసారీ ఒకే హీరో ఒకే హీరోయిన్ కలిసి నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్న వార్త ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ని క్రియోట్ చేసింది.


ఖచ్చితంగా చెప్పాలంటే ఒకే హీరో హీరోయిన్ కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రావడం అనేది ఇప్పటి వరకు భారత సినీ చరిత్రలో జరగలేదు. ఆ అరుదైన సంఘటనకు మే 31 అవ్వబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ అరుదైన బాక్సాఫీస్ వార్ కోసం తమన్నా.. ప్రభుదేవాల కాంబో రెడీ అయ్యింది. వీరిద్దరు కలిసి నటించిన అభినేత్రి 2, కామోషి సినిమాలను మే 31న విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. హీరో హీరోయిన్ మాత్రమే సేమ్ కాదు.. ఈ రెండు సినిమాల జోనర్లు కూడా సేమ్ అవ్వడంతో ఆసక్తికరమైన పోటీ ఉండబోతోందని అంతా భావించారు. 


అయితే ఇలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం వల్ల అన్ని చోట్ల రెండు సినిమాలకు నష్టం జరగడం ఖాయం అనే ఉద్దేశ్యంతో విడుదల మరో నాలుగు రోజులు ఉండగా ఎట్టకేలకు కామోషి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రాఫిక్స్ వర్క్ పెడ్డింగ్ లో ఉన్న కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే పోటీ వద్దనే ఉద్దేశ్యంతో చివరి నిమిషంలో సినిమాను వాయిదా వేసి ఉంటారనే టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా కంటెంట్ గట్టిగా ఉంటే ఒకేసారీ ఒకే హీరో హీరోయిన్ నటించిన సినిమాలు రెండు కాదు మూడు రిలీజైనా బాక్సాఫీస్ బద్దలవుతుంది.
 
  



మరింత సమాచారం తెలుసుకోండి: