ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత జగన్ చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీ అధినేత జగన్ కు పట్టం కట్టారు. జగన్ గెలుపుపై చాలా మంది సీనియర్ రాజకీయ నేతలతో పాటు జాతీయ నాయకులు మరియు అదే విధంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జగన్ ని జీవితంలో మర్చిపోలేను అన్నట్టుగా తన శుభాకాంక్షలు ఇటీవల తెలిపారు.
ముఖ్యంగా జరిగిన ఎన్నికలలో పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంపై దర్శకుడు పూరి కొద్దీ సేపటి క్రితం స్పందించారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అందుకు జగన్ కు రుణపడి ఉంటామని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఉమా శంకర్ వైసిపి అభ్యర్థిగా గత ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినప్పటికీ గెలవెలకపోయారు.
మరోసారి జగన్ ఆయనకు అవకాశం ఇవ్వడంతో యుద్ధంలోకి మళ్ళీ తీసుకువచ్చి తన సోదరుడి గెలుపులో జగన్ కీలకపాత్ర పోషించారని పూరి తెలిపారు. అదే విధంగా జగన్ విజయంపై కూడా పూరి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మీటింగ్ పెట్టుకొని మరి జగన్ ని గెలిపించారని ఇంతటి భారీ విజయం అందుకోవడం చాలా గ్రేట్ అని అన్నారు.