టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు వచ్చారు..అందులో కొద్ది మంది మాత్రమే మంచి సెక్సెస్ సాధించారు.  చిత్రం సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయి జయం సినిమాతో హిట్ కొట్టిన తేజ ఆ తరహా సినిమాలు అందించలేక పోయారని టాక్ వచ్చింది.  అంతే కాదు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాపు  అందుకున్నాయి.  ఆ మద్య రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.


ఈ సినిమా విజయం తర్వాత తేజ కు వెంటనే బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’బయోపిక్ కి సిద్దమయ్యారు.  ఈ సినిమా ముహూర్తం షాట్ కూడా ఓకే అయ్యింది..కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి తేజ ఔట్ అయినట్లు వార్తలు రావడం..తేజ కూడా కన్ఫామ్ చేయడం జరిగింది.  ఆ ప్రాజెక్ట్ తర్వాత క్రిష్ కి వచ్చినా..ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం సక్సెస్ కాలేదు.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ తేజ స్పందించారు.  ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకొని మంచి పని చేసాడు అంటూ పలువురు దర్శక నిర్మాతలు తేజ ని కొనియాడారట. 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సీత చిత్రానికి దర్శకత్వం వహించిన తేజ మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ పై కామెంట్ చేసాడు.  నాకు మొదటి నుంచి ఆ సీనిమా డీల్ చేయలేనేమో అన్న అనుమానం కలగడం..అందుకే తప్పుకోవడం జరిగిందని అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఫలితాలు చూసాక ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకొని మంచి పని చేసావ్ అంటూ నన్ను విమర్శించిన వాళ్లే పొగిడారు . ఎన్టీఆర్ బయోపిక్ చేయకపోవడం వల్ల నాకు చాలామంచి పేరు వచ్చిందని అంటున్నాడు తేజ .



మరింత సమాచారం తెలుసుకోండి: