టైగర్ జిందా హై ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోనే నటిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అందుకే సల్మాన్- కత్రిన జోడీని రిపీట్ చేస్తూ అలీ అబ్బాస్ జాఫర్ భారత్ సినిమాని తెరకెక్కించడం బాలీవుడ్ తో సహా అన్నిచోట్లా హాట్ టాపిక్ గా మారింది. టైగర్ జిందా హై సల్మాన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా బాక్సాఫీస్ ని బద్దలు కొడుతూ ఏకంగా 600కోట్లు వసూలు చేసింది. అందుకే మరోసారి సేమ్ విక్టరీ అందుకోవాలన్న పట్టుదలతో భారత్ సినిమాకి ఈ కాంబినేషన్ కమిటైంది. 


ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ లో సల్మాన్ భాయ్ బిజీ బిజీగా ఉన్నాడు. మొత్తం మీద షూటింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న సినిమా రిలీజవుతోంది.  ఈ సందర్భంగా సల్మాన్ - కత్రిన- జాఫర్ బృందం భారత్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఏపీ- తెలంగాణ రైట్స్ ని ఏషియన్ సినిమాస్ చేజిక్కించుకుందని సమాచారం.  


దేశభక్తి బ్యాగ్డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ యాక్షన్ ఓ రేంజులో ఉండబోతోంది. పీరియాడిక్ డ్రామాలో సల్మాన్  ఓవైపు సర్కస్ వాలాగా.. దేశ భక్తుడైన నేవీ అధికారికగా రకరకాల షేడ్స్ లో కనిపించనున్నాడు. అలాగే ఇందులో లోఫర్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్ యాంగిల్ తో యూత్ ని మెస్మరైజ్ చేయబోతోందట. అంతేకాదు కత్రిన కూడా ఒక కొత్త లుక్ తో ఫ్యాన్స్ ని తెగ ఆకర్షిస్తోంది. 600కోట్లు వసూలు చేసిన 'టైగర్ జిందా హై' దాటి భారత్ 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: