తమిళ సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరోల్లో విజయ్ ఒకరు.  విజయ్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అనే చెప్పాలి. మెర్సల్, సర్కార్ లాంటి కాంట్రవర్సీ సృష్టించిన సినిమాల భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. 


విజయ్ హీరోగానే కాకుండా సమాజ సేవ చేయడంలో ముందుంటారు.  తన లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా గడుపుతుంటారని టాక్.  ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు ముంచుకు వచ్చినా..అక్కడకు వెళ్లి వారికి చేతనైనంత సహాయం అందించి వస్తుంటారు.  ప్రకృతి విపత్తులు లాంటివి ఏమైనా వస్తే భారీగా విరాళాలు ఇస్తుంటారు.  ఆ మద్య చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినపుడు ప్రజలకు తన సహాయాన్ని ఎంతగానో అందించారు.  కేరళాలో వచ్చిన భారీ వర్షాలకు ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మంది బాధితులకు తన వంతు సహాయసహకారాలు అందించారు. 


ఎంత సినిమా షూటింగ్ బిజీలో ఉన్నా.. ప్రతి ఏడాది కార్మిక దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, మే 1వ తేదీన చెన్నైలోని ఆటో డ్రైవర్లందరికీ ఆయన లంచ్ ఏర్పాటు చేస్తుంటాడు.  అయితే ఈసారి ఎన్నికల హడావిడి కారణంగా ఆ రోజున ఈ కార్యక్రమాన్ని జరపలేకపోయాడు. అందువలన తాజాగా ఆటో డ్రైవర్లందరికీ భోజనాలు ఏర్పాటు చేసేశాడు.

హీరో విజయ్ నిర్వహించిన ఈ విందు కార్యక్రమం ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజయ్ సెక్రటరీ బస్సీ ఆనంద్ చేపట్టారు. ఆటో డ్రైవర్లంతా 'ఫుడ్ అదిరింది' అంటూ విజయ్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటూ వెళ్లారట.ప్రస్తుతం విజయ్ .. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: