ఈ మద్య స్టార్ హీరోలు..హీరోయిన్లు నటిస్తున్న సినిమాలు రిలీజ్ అయి థియేటర్లలో ప్రదర్శించే వరకు టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఆ మద్య బాలీవుడ్ లో పద్మావత్, మణికర్ణిక సినిమాల రిలీజ్ పై ఎన్నో అవరోధాలు వచ్చాయి..ఆ తర్వాత తమిళ్ లో మెర్సల్, సర్కార్ లాంటి సినిమాలకు అటంకాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు రిలీజ్ కావడం సూపర్ హిట్ కావడం..మంచి కలెక్షన్లు రాబట్టడం జరిగిపోయింది.
తాజాగా ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘భారత్’ మూవీకి రిలీజ్ కి అడ్డంకులు పడ్డాయి. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి అందాల తార ప్రియాంక చోప్రా అనూహ్యంగా తప్పుకోవడంతో కత్రినా కైఫ్కు హీరోయిన్గా ఛాన్స్ దక్కింది. కాగా,ఈ మూవీకి 'భారత్' అనే పదాన్ని టైటిల్గా వాడటం సరికాదని, టైటిల్ను వెంటనే మార్చాలని విపిన్ త్యాగీ అనే వ్యక్తి డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఈ సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో రిలీజ్పై సందిగ్ధత ఏర్పడింది. ఇది చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. 'భారత్' అనే పదాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని పేర్కొన్నారు. దాంతో ఈ మూవీ రిలీజ్ పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మూవీకి రిలీజ్ కి అడ్డుగా ఉన్న ఇబ్బంది తొలగిపోయింది. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన భారత్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.