అల్లు అర్జున్ క్రేజీ స్టార్. మాస్ మసాలా హీరో, ఆయన తాజా మూవీ ఇపుడు సెట్స్ మీద ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతికి లైన్లో పెట్టారు. ఈ మూవీ విషయానికి వస్తే ఎన్నో విశేషాలు ఉన్నాయట.


ఇందులో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్  కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ హీరోగానే మూవీస్ చేసిన సుశాంత్ ఇక సైడ్ క్యారక్టర్లకు మళ్ళుతున్నట్లుగా తెలుస్తోంది. సొలో హిట్ కొట్టి చాలా కాలమైన ఈ యంగ్ హీరో ఇపుడు తన రూట్ మార్చుకున్నట్లే కనిపిస్తోంది. దానికి తోడు త్రివిక్రం మూవీ అంటే ఆ విషయం ఉన్న పాత్రే ఉంటుంది.


మొత్తానికి సుశాంత్ సరైన డెసిషన్ తీసుకున్నాడనే చెప్పాలి. కాగా తాను బన్నీ మూవీలో పార్ట్ కాబోతున్నట్లుగా సుశాంత్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారినిది. మరి ఇందులో ఆయన పాత్ర ఏంటో, ఎలా ఉంటుందో అన్నది రివీల్ చేయలేదు. ఏది ఏమైనా సుశాంత్ కి ఈ మూవీతో హిట్ తగిలినట్లే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: