పలువురు అందాల కథానాయికలు సోషల్ మీడియా ట్రోల్స్ కి బలైపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాపతలో బెబో కరీనా కపూర్ సైతం తిట్లు- చీవాట్లు తినాల్సి రావడం విస్మయానికి గురి చేస్తోంది. సీనియర్ భామల్లో బెబో కరీనా కపూర్ ఓవైపు వ్యక్తిగత జీవితాన్ని.. మరోవైపు వృత్తిగత జీవితాన్ని ఎంతో బ్యాలెన్స్ డ్ గా నడిపిస్తూ సాటి నాయికలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

భర్త- పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక తారగా కరీనాకి పేరుంది. ఇక తైమూర్ అలీఖాన్ తల్లిగా కరీనా నిరంతరం ఎంతో కేరింగ్ తో ఉండడం చూస్తున్నదే. అయితే కరీనా విదేశీ (టస్కనీ) వెకేషన్ కి సంబంధించిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ ఫోటోలో బెబో లుక్ పై తీవ్రమైన ట్రోలింగ్స్ తో నెటిజనులు విరుచుకుపడ్డారు.

కరీనా మ్యానేజర్ పూనమ్ దమానియా ఈ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోకి `సన్ కిస్ డ్ బెబో .. మిస్ యూ` అంటూ వ్యాఖ్యను జోడించారు. ఇందులో కరీనా ఎలాంటి మేకప్ లేకుండా ఒరిజినల్ గెటప్ తో కనిపించి సర్ ప్రైజ్ ని ఇచ్చారు. అయితే ఈ ఫోటో చూడగానే `కరీనా ఓల్డ్` అంటూ ఫ్యాన్స్ తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. ``రియల్ స్కిన్.. మరీ వృద్ధురాలిలా కనిపిస్తోంది` అంటూ ఘాటైన వ్యాఖ్యను చేశాడో ఓ నెటిజన్. 38 ఏళ్ల కరీనా తన వయసును మించి ఓల్డ్ గా కనిపిస్తోందని వేరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. `హెయిరీ ఆర్మ్ పిట్` అంటూ నేస్టీ కామెంట్ ని చేశాడో నెటిజన్.

వాస్తవానికి బెబో కరీనా - సైఫ్ జోడీ సోషల్ మీడియాకి బహుదూరం. తన మ్యానేజర్ చేసిన పనికి తాను తిట్లు తినాల్సొస్తోందిలా. దీనిపై ఇప్పటివరకూ కరీనా స్పందించలేదు. బెబో కెరీర్ ని పరిశీలిస్తే.. ప్రస్తుతం `గుడ్ న్యూస్` అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ - దిల్జీత్ దోసాంజి- కియరా అద్వాణీ తదితరులు నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: