నేషనల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, యంగ్ డైరెక్టర్  సుజిత్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న  ‘సాహో' ఇప్పటికే  దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకునప్పటికీ.. ఇంకా ఫ్యాచ్ వర్క్ కు సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.  కాగా  ఈ ఫ్యాచ్ వర్క్ పార్ట్ ను  త్వరగా పూర్తి  చేయాలనే ఉద్దేశ్యంతో  'సాహో' టీమ్ నైట్  కూడా షూట్ చేస్తున్నారు. 


కాగా  హైదరాబాద్ లోని  స్టూడియోలో జరుగుతున్న ఈ రోజు  నైట్ షూటింగ్ లో  ప్రభాస్ - శ్రద్ధా కపూర్ ల పై  ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు సుజిత్.  అయితే ప్రభాస్ -  శ్రద్ధాలతో పాటు  విలన్ 'నిల్ నితిన్ ముఖేష్' కూడా  షూట్ లో  పాల్గొన్నట్లు తెలుస్తోంది.  పైగా  ఈ రోజు నైట్ చేస్తోన్న షాట్స్ లో  విలన్ చనిపోయే షాట్స్ కూడా  ఉంటాయట. విలన్ చినపోయే షాట్ అంటే..,  బహుశా ఈ రోజు నైట్  క్లైమాక్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షూట్ చేస్తుండొచ్చు.        


మరో పక్క  'సాహో'కి పని చేస్తోన్న  డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో  'సాహో'  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.  మొత్తానికి  హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న  ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలు మరియు  ప్రభాస్ పాత్రకు సంబధించిన యాక్షన్  పార్ట్...   హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట.   భారీ బడ్జెట్ తో  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  'యు.వి క్రియేషన్స్' ఈ భారీ చిత్రాన్ని  నిర్మిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: