నేషనల్ స్టార్
ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకునప్పటికీ.. ఇంకా ఫ్యాచ్ వర్క్ కు సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కాగా ఈ ఫ్యాచ్ వర్క్ పార్ట్ ను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో 'సాహో' టీమ్ నైట్ కూడా షూట్ చేస్తున్నారు.
కాగా హైదరాబాద్ లోని స్టూడియోలో జరుగుతున్న ఈ రోజు నైట్ షూటింగ్ లో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ ల పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు సుజిత్. అయితే ప్రభాస్ - శ్రద్ధాలతో పాటు విలన్ 'నిల్ నితిన్ ముఖేష్' కూడా షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ రోజు నైట్ చేస్తోన్న షాట్స్ లో విలన్ చనిపోయే షాట్స్ కూడా ఉంటాయట. విలన్ చినపోయే షాట్ అంటే.., బహుశా ఈ రోజు నైట్ క్లైమాక్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షూట్ చేస్తుండొచ్చు.
మరో పక్క 'సాహో'కి పని చేస్తోన్న డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 'సాహో' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలు మరియు ప్రభాస్ పాత్రకు సంబధించిన యాక్షన్ పార్ట్... హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట.
భారీ బడ్జెట్ తో
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'యు.వి క్రియేషన్స్' ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.