బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు.


ఇప్పటికే మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. రిలీజ్ కు ఇంకా రెండు నెలలు టైం ఉండగానే సాహో బిజినెస్ స్పీడందుకుందని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాకు ముందే ఫ్యాన్స్ ఆఫర్ ఇచ్చి రైట్స్ సొంతం చేసుకుంటున్నారు.


ఈ క్రమంలో నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సాహో నైజాం, ఉత్తరాంధ్ర హక్కులకు గాను 45 కోట్ల దాకా ఆఫర్ చేశాడట. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ అలాంటి స్టాండర్డ్స్ ఉన్న సినిమానే చేస్తున్నాడని చెప్పొచ్చు. దిల్ రాజు లాంటి నిర్మాత రిస్క్ చేస్తున్నాడు అంటే సాహో పక్కా హిట్ అన్నట్టే అని చెప్పుకుంటున్నారు.


ఇక చిత్రయూనిట్ మాత్రం హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వస్తున్న సాహో సినిమా మరోసారి తెలుగు సినిమా స్టామినా అందరికి తెలిసేలా చేస్తుందని అంటున్నారు. సాహో ప్రభాస్ కు నిజంగానే మరో బాహుబలి అవుతుందా కాదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: