తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2.0 అలానే ఇటీవల విడుదలైన పేట సినిమాలతో మంచి విజయాలు అందుకుని కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందుకుని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అయన, తమిళ ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. నిజానికి గతంలో చాలా సార్లు తాను రజిని గారితో సినిమా చేయాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదని, అయితే ఇన్నాళ్లకు ఆయనను దర్శకత్వం వహించే ఛాన్స్ తనకు దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మురుగదాస్. ఇకపోతే ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అన్ని వర్గాలకు చేరువయ్యేలా మురుగదాస్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 

అంతేకాదు మొన్న వచ్చిన పేట సినిమాలో రజినీని మంచి మాస్ క్యారెక్టర్ లో చూసిన అయన ఫ్యాన్స్, ఈ సినిమాలో మరింత ఎనర్జిటిక్ గా అలానే మాస్ గా ఉండే పాత్రను ఈ సినిమాలో రూపొందించడం జరిగిందట. ఇకపోతే సినిమాలో అంతర్లీనంగా మంచి మెసేజి ఉందని, రెగ్యులర్ గా మురుగదాస్ సినిమా స్టయిల్లోనే సాగుతూ రజిని ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలు జోడించడం జరిగిందని సమాచారం. ఇక హీరోయిన్ గా నటిస్తున్న నయనతార మరియు రజిని మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ చాలాబాగస్తున్నాయని అంటున్నారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా యాక్షన్ మరియు ఫైట్ సీన్స్ కోసం మురుగదాస్ మరింత కేర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంత ఎంటెర్టైమెంట్ వున్నా కానీ, ఆడియన్స్ ని అలానే రజిని ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఫైట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇకపోతే పాటలు కూడా అందరికి నచ్చేలా మంచి ట్యూన్స్ తీసుకుంటున్నాడని, ఇటీవల పేట కి సంగీతం అందించిన అనిరుద్, ఈ సినిమాకు కూడా అంతకంటే మంచి మాస్ బీట్ సాంగ్స్ ఇస్తున్నాడని సమాచారం. 

సో మొత్తంగా చూసుకుంటే రజినితో చేయబోయే ఈ దర్బార్ సినిమా ద్వారా మురుగదాస్ గట్టిగా హిట్ కొట్టాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియదుగాని ప్రస్తుతం ఈ వార్త అటు కోలీవుడ్ వర్గాల్లో ఇటు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి విడుదలకు ముందు నుండే ఈ సినిమా ఇంతటి హైప్ క్రియేట్ చేస్తుంటే రేపు విడుదల తరువాత ఎంతటి విజయాన్ని అందుకుని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: