విక్టరీ వెంకటేష్ వయసుతో నిమిత్తం లేకుండా సినిమాలు చేసుకుంటూ కుర్ర హీరోలకు మతిపోగొడుతున్నారు. మినిమం ఇయర్ కి రెండు సినిమాలైనా విడుదల చేస్తూ సీనియర్ హీరోలు కూడా షాక్ పుట్టిస్తున్నారు వెంకటేశ్. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడే వెంకటేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగణ్, రకుల్, టబూ ప్రధాన పాత్రధారులుగా నటించిన నీటిలో బ్లాక్ బస్టర్ ఐనా “దే దే ప్యార్ దే” సినిమాను సురేష్ ప్రొడక్షన్ వెంకటేష్ ని హీరోగా పెట్టి తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  


పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబూ చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది తాజా సమాచారం.


28 ఏళ్ల క్రితం “కూలీ నెం.1” సినిమాలో వెంకీ జోడీ కట్టిన టాబూ, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుందన్న మాట. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారా ? లేదంటే మరొకరిని ఎంపిక చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ టాబు కలిసి నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: