'ఇష్క్' ముందు వరకూ టాలీవుడ్ లో ప్లాప్ అనే పదానికి పర్యాయపదం అనే రేంజ్ లో వుండేది నితిన్ పరిస్ధితి. ఎట్టకేలకూ నితిన్ 'ఇష్క్' తరువాత 'గుండెజారి గల్లంతయ్యిందే' 'అ ఆ' చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడనుకునే లోపే.. గత మూడు సినిమాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ 'భీష్మ'ని ఫైనల్ చేశాడు.
కాగా రేపు 12వ తేదీ నుండి ఈ చిత్రం మొదలుకానుంది. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. 'ఛలో' మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. మరి కనీసం ఈ సినిమానైనా నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. నితిన్ ఈ సినిమాతో పాటు కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రానున్న వైవిధ్యంగా సాగే ఓ థ్రిల్లర్ సినిమాకి కూడా సైన్ చేశాడు.