సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది . లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈ చిత్రాన్ని 2020 జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


అసలు ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే అనుకున్న స్థాయిలో షెడ్యూల్స్ పూర్తికాకపోవడంతో విడుదల వాయిదాపడింది . దసరా కు అనుకున్న సినిమాని సంక్రాంతి కి విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట . గతకొంత కాలంగా రజనీకాంత్ కు సరైన సక్సెస్ ఏది అందడం లేదు . చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతూనే ఉన్నాయి దాంతో ఈ సినిమా దర్బార్ అయినా హిట్ అవుతుందా అన్న టెన్షన్ రజనీ ఫ్యాన్స్ లో నెలకొంది.

ఇదిలా ఉండగా, జూన్ 12 న రోబో 2 .0 చైనా లో విడుదల అయ్యి మంచి వసూళ్లు రాబడుతోంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ యాజమాన్యం ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తోందట. దీని కోసం చాలానే డబ్బు ఖర్చు పెడుతున్నారు అని తెలుస్తోంది. అంతే కాకుండా షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రోబో 2 .౦ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇదంతా రజనీకాంత్ కి చైనా లో ఉన్న క్రేజ్ ని కాష్ చేస్కోడానికే అనిపిస్తోంది. ఏదైతే ఏంటి, రజని ఇంకొన్నాళ్ళు థియేటర్లలో సందడి చెయ్యడం ఖాయం అనే అనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: