కింగ్ నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమా మన్మధుడు 2 టీజర్ నిన్న యూట్యూబ్ లో విడుదలైన విషయం తెలిసిందే. టీజర్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ డైలాగ్స్ తో అందర్నీ ఆకట్టుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అయితే నాగ్ కు మరొక హిట్ ఖాయమని అంటున్నారు. ఇక టీజర్ లో నాగార్జున, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు పలికిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి, 

ముఖ్యంగా క్లాసి టచ్ తో సాగిన ఈ టీజర్ లోని షాట్స్ ని బట్టి చూస్తే సినిమాలో ఫోటోగ్రఫీ అద్భుతంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే టీజర్ ని గమనిస్తే అందులో అన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్క హీరోయిన్ ని మాత్రం అందులో చూపించకపోవడాన్ని గమనించవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ లు స్పెషల్ అఫియరెన్స్ లు ఇస్తున్నారు. ఇక వీరిలో రకుల్ పూర్తి స్థాయి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే టీజర్ లో హీరోయిన్ ని చూపించకపోవడంపై కొందరు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని ప్రశ్నించగా, అయన ఇలా సమాధానం ఇచ్చారట. 

నిజానికి సినిమాలో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర కూడా అంతే ప్రాధాన్యతను కలిగిఉంటుందని, అందువల్ల తాను హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పోయే పాత్రలా టీజర్ లో చూపించడం తనకు ఇష్టం లేదని, అందువలన హీరోయిన్ కోసమే ఒక చిన్న టీజర్ ని కట్ చేశామని, అతి త్వరలో దానిని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుందని అయన అన్నారట. మరి దర్శకుడు చెప్తున్నట్లు ఈ సినిమాలో రకుల్ ఎంతవరకు అందరిని ఆకట్టుకునేలా నటించిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: