ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. గురువారం విడుదలైన ఈ టీజర్ అతి తక్కువ సమయంలోనే అనగా 24 గంటల్లోనే 60 మిలియన్ల డిజిటల్ న్యూస్ రావడంతో అనేక రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరే విధంగా తీయడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెట్టేసుకున్నారు.


బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గా విశిష్టత దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ నీ ఇటీవల ఓ థియేటర్లో ప్రదర్శిస్తున్న సమయంలో ప్రభాస్ అభిమానులు చేసిన హడావిడి కేరింతలు మొత్తం సోషల్ మీడియాలో రావడంతో ఆ వీడియో వైరల్ అవడంతో ఆ వీడియోను చూసిన శ్రద్ధ కపూర్ ప్రభాస్ అభిమానుల అభిమానానికి షాక్ కి గురైంది.


అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ అని కామెంట్ పెట్టింది. సుజీత్ దర్శకత్వంలో, ప్రభాస్ సరసన నటించడం, సాహో చిత్ర యూనిట్ తో కలసి పనిచేయడం తన డ్రీమ్ అని పేర్కొంది. సాహో చిత్రం కోసం మేమంతా 2 ఏళ్లుగా కష్టపడుతున్నాం. మా కష్టానికి ఈ విధమైన రెస్పాన్స్ వస్తుండడం సంతోషంగా ఉందని శ్రద్దా కపూర్ తన అభిప్రాయాన్ని ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: