బాలీవుడ్లో సంచలనం రేపిన జియాఖాన్ ఆత్మహత్యను పోలీసులు ఛేధించి, జరిగిన ఇన్సిడెంట్ అంతా ఓ ఆత్మహత్యగా కేసును ఫైల్ చేశారు. జియాఖాన్ భాయ్ ప్రెండ్ సూరజ్ పంచోలి ఈమెను హత్య చేశాడని, జియాఖాన్ తల్లిదండ్రులు ఎంత వాధించిన, రాజకీయ ఒత్తిళ్ళతో అది ఆత్మహత్యగానే పోలీసులు వర్ణించారు.
జియాఖాన్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోర్సెనిక్ వివరాల్ని పోలీసులు సైతం బయటకు చెప్పటానికి నిరాకరించారు. దీంతో జియాఖాన్ మరణం ఖచ్చితంగా హత్యే అని లోకానికి తెలిసినా, ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. జూన్ 3న జరిగన ఈ సంఘటకు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. అయితే లేటెస్ట్ ఈ కేసులో మరో కొత్త కొణం బయటకు వచ్చింది.
జియాఖాన్ది హత్యే అంటూ తల్లి రబియా అమిన్ జియా కొన్ని ఫోటోలను బయటకు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సంచలనంగా మారింది. ఆ ఫోటోలలో జియాఖాన్ మెడపై ఎన్నో రకాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. కూతురి మరణాన్ని ఆత్మహత్యగా మార్చి, దోషి తప్పించారనే ఆవేదనతో తల్లి రబియా ఇప్పుడు అసలైన ఆధారాలను బయట పెట్టి, న్యాయాన్ని కోరుతుంది. ఈ ఆధారాలను చూసిన పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.