శృతిహాసన్ మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. గతంలో ఐరెన్ లెగ్ అనిపించుకున్న శృతి గబ్బర్సింగ్ సినిమాతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో రాం చరణ్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అంతేకాదు అడపా దడపా ఐటం సాంగ్స్ను చేసింది. అయితే కొంతకాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంది. అయితే రీసెంట్గా రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కన్ ఫర్మ్ అయింది. ఇన్నాళ్లు వార్తల్లో నానిన ఈ విషయం, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయడంతో ఫైనల్ అయిపోయింది.
బలుపు సినిమా తరువాత మళ్లీ రవితేజ-శృతిహాసన్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. శృతి హాసన్ తెలుగులో చేసి చాలాకాలం అయింది. రేసుగుర్రం, శ్రీమంతుడు తరువాత మళ్లీ తెలుగు తెరపై కనిపించడం ఇదే. దాదాపు మూడు నాలుగేళ్ల గ్యాప్ తరువాత శృతి హాసన్ తెలుగులో కనిపించబోతోంది. అలాగే విన్నర్ ఫ్లాప్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్నసినిమా కూడా ఇదే.
గోపీచంద్ మలినేని-బుర్రాసాయి మాధవ్ టీమ్ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ మీద బిజీగా వున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం రవితేజ చేస్తున్న డిస్కోరాజా సినిమా ఫినిష్ కాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందట. ఇక ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత. మరి ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అవుతుందో లేక ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కి ఈ ఒక్క సినిమాతో చెన్నై చెక్కేస్తుందో చూడాలి.