యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా టీజర్ ఇటీవల నాలుగు భాషల్లో విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా టీజర్ 60 మిలియన్ల వ్యూస్ సంపాదించి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టీజర్ కి మంచి స్పందన రావడంతో...సాహో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశారు.


ఇటువంటి క్రమంలో మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు డైరెక్టర్ సుజిత్ ని అడగగా చాలా చక్కగా జవాబులు చెప్పారు. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ను డైరెక్ట్ చేయడం లో ఒత్తిడి ఉందా అని ప్రశ్నిస్తే "అసలు ప్రెజర్ లేనే లేదని.. ప్రభాస్ కు నా వర్క్ పై పూర్తిగా నమ్మకం ఉంది.  నాకు ఆ విషయం మాత్రమే ముఖ్యం. అదే కాకుండా నిర్మాతలు.. టీమ్ మెంబర్స్ అందరూ నాపై నమ్మకం ఉంచారు. అయితే రిలీజ్ కు దగ్గరయ్యే కొద్ది నాకు కొంత ప్రెజర్ అనిపిస్తోంది" అని సమాధానం ఇచ్చాడు. 'బాహుబలి' కి ముందే 'సాహో' స్క్రిప్ట్ వినిపించానని.. ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపాడు.


ఇదే క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒత్తిడి పెడుతున్నారా అని కొంతమంది ప్రశ్న అడుగగా...డైరెక్టర్ సుజీత్ బదులిస్తూ..బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత 'సాహో' సినిమా చేస్తున్న నేపథ్యంలో..సినిమా గురించి ముందు గోప్యంగా ఉంచటంతో మొదటిలో ప్రభాస్ అభిమానులు ఒత్తిడి చేశారని డైరెక్టర్ సుజిత్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ తరువాత సినిమా గురించి కొన్ని కొన్ని అప్డేట్లు బయటకు చెప్పడంతో ప్రభాస్ అభిమానులు అర్థం చేసుకున్నారని డైరెక్టర్ సుజిత్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: