యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మూవీ సాహో. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు అందరి నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించి ఇంకా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే టీజర్ విడుదల తరువాత ఇప్పటివరకు సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి అనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను ఎంతైనా ఇచ్చి కొనడానికి ఎగబడుతున్నట్లు సమాచారం. టీజర్ విడుదల తరువాత ఇది ఒక పెద్ద యాక్షన్ థ్రిల్లర్ లా ఉంది అనే విషయం మాత్రం మనకు కొంతవరకు అర్ధమవుతుంది. 

ఇక ఈ సినిమా సంగతుల గురించి నిన్న ఒక జాతీయ పత్రికతో మాట్లాడిన ప్రభాస్, సినిమాకు సంబంధించి కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పుకొచ్చారు. అయన మాట్లాడుతూ, సాహో తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని అయన అన్నారు. ఇక దర్శకుడు సుజిత్ ఈ సినిమా కథ తనకు చెప్పిన దగ్గరినుండి తన టీమ్ తో ఈ మూడేళ్లపాటు పడ్డ శ్రమ తనకు తెలుసునని, అలానే ఈ సినిమా ఒక పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అని అన్నారు. ఇక సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని, అయితే వాటిని తీయడానికి గ్రాఫిక్ వర్క్ వంటి వాటికే చాలా టైం పట్టిందని అయన చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ శ్రద్ధ మంచి ప్రొఫెషనల్ అని, ఆమెతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు. 

ఇక తన స్నేహితులే నిర్మాతలు అవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అయితే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ చాలా గొప్పదని, సినిమాకు ఏది అవసరమైనా ఖర్చు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు నడిచిన యువి క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక తమ సాహో సినిమా రేపు విడుదల తరువాత తప్పకుండా ప్రేక్షకుల అంచనాలు అందుకుని పెద్ద హిట్ గా నిల్సుస్తుంది అనే నమ్మకం తమ టీమ్ కు ఉందని అయన అభిప్రాయపడ్డారు. మరి అయన చెపుతున్నట్లు సాహో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో రేపు విడుదల తరువాత కానీ తెలియదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: