పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారతావని నీరాజనాలు అందుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను అవమానిస్తూ పాక్ మీడియా రూపొందించిన యాడ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాడ్ ఇరు దేశాల మధ్య ఉన్న విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఇప్పటికే ఈ యాడ్పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. భారత టెన్నిస్ స్టార్, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సతీమణి సానియా మీర్జా సైతం మండిపడింది.
ఇక తాజాగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఈ యాడ్పై తీవ్రంగా మండిపడింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. నిన్ననే నా వాట్సాప్లో పాకిస్తాన్కు సంబంధించిన ఈ యాడ్ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్ ఇది మంచిది కాదు.
ఈ యాడ్పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్( తన లోదుస్తులు చూపిస్తూ) డబుల్ కప్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక పూనమ్ చర్యపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమె చేసిన పనిని మెచ్చుకోగా మరికొందరు తప్పుబడుతున్నారు.