శర్వానంద్ నటిస్తున్న రణరంగం సినిమా పూర్తయినా, రిలీజ్ కు సరైన డేట్ దొరకక చిక్కుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తుండడంతో, శర్వా-సుధీర్ వర్మ సినిమాకు డేట్ లేకుండా వుంది. వాస్తవానికి క్రికెట్ మ్యాచ్ లకు భయపడి జూన్ అంతా మంచి సినిమాలను రిలీజ్ చేయడం వేస్ట్ చేసుకున్నారు. 
జులై మొదటి రెండు వారాలు కూడా ఇలాగే వదిలేసారు. అయితే అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. జులై మూడోవారంలో డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2కి డేట్ లాక్ చేశారు. 


ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవడానికి సాహో రెడీగా వుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి నాని గ్యాంగ్ లీడర్ ని అంటూ వస్తున్నాడు. ఇక చివరికి మిగిలినవి రెండే డేట్ లు, ఆగస్టు 2వ తేదీ. కానీ ముందువారం డియర్ కామ్రేడ్. వెనుకవారం మన్మధుడు 2. అందువల్ల ఈ డేట్ ఫిక్స్ చేస్తారా? లేదా..! అన్నది అనుమానం. ఇక ఇదేదీ కాదనుకుంటే లాస్ట్ ఆప్షన్‌గా 23కు వెళ్లాలి. కానీ ముందువారం సాహో. వెనుకవారం గ్యాంగ్ లీడర్ వుంటాయి. కాదూ అంటే సెప్టెంబర్. మొత్తానికి దర్శక, నిర్మాతలు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శర్వానంద్ రణరంగం సినిమాకు సరైన డేట్ లేకుండా అయిపోయింది. 


సుధీర్ వర్మ మాత్రం నింపాదిగా సినిమాను ఇంకా చెక్కుతూ వస్తున్నారు. కాస్త ముందుగా ప్లాన్ చేసివుంటే మే నెలలో రిలీజ్ చేసే అవకాశం వుండేది. అది కాస్తా మిస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి? ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: