టాలీవుడ్, కోలీవుడ్ కంటే కూడా బాలీవుడ్‌లో ఎక్కువగా బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. అంతే కాదు.. ఈ బయోపిక్స్ దర్శక నిర్మాతలతో పాటు నటీ నటులకు కూడా పేరు ప్రఖ్యాతులతో పాటు అవార్డ్స్, రివార్డ్స్ ను తెచ్చిపెడుతున్నాయి. అందుకే మన హీరోస్ అండ్ హీరోయిన్స్ బయోపిక్ అనగానే డైరీ ఖాళీ లేకపోయినా డేట్స్ అడ్జెస్ట్ చేసి మరీ కాల్షీట్స్ ఇస్తున్నారు. అందుకే సినీ స్టార్స్, ప్లేయర్స్, పొల్టీషియన్స్ జీవితాలు తెరపైకొస్తున్నాయి. అంతేకాదు అన్నీ ఇండస్ట్రీలలో అలాంటి పాత్ర తమ వరకూ వస్తే బాగుంటుందని ఆశించే నటీనటులెందరో. 


ముఖ్యంగా మహానటి లో నటించిన కీర్తి సురేష్ ని చూశాకైతే చాలా మంది హీరోయిన్స్‌కి ఇదే ఆలోచన అయిపోయింది. అలానే కియారా అద్వాణీ కూడా ఓ బయోపిక్‌లో నటించాలని కలలు కంటోంది. అందుకే 'బయోపిక్‌' అంటే నాక్కూడా ఇష్టమే. నా కెరీర్‌ ప్రారంభంలోనే 'ధోనీ' బయోపిక్‌లో నటించా. నిజ జీవిత పాత్రలు పోషించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నటీనటులకు అదో సవాల్‌. ఇక నా వరకూ మధుబాల బయోపిక్‌లో నటించాలని ఉంది. ఆమె పాత్రలో నన్ను నేను తెరపై చూసుకోవాలని ఉంది. 


మధుబాల గొప్ప నటి. ఆమె నటిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. ఆమె కథని సినిమాగా తీస్తే బాగుంటుందంటోంది. అంతేకాదు కరీనా కపూర్ అంటే కూడా చాలా ఇష్టం. అయితే ఎవ్వరినీ అనుసరించను. కథా నాయికగా నాకంటూ ఓ శైలి సృష్టించుకోవాలని ఉంది.. అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది కియారా. 'అర్జున్‌రెడ్డి'హిందీ రీమేక్‌ 'కబీర్‌సింగ్‌'లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరణ్ జోహార్ లస్ట్ స్టోరీస్ లో నటించిన కియారా ఇలా బయోపిక్స్ లో నటించాలనుంది అన్న మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: