తారక్ తో ఆది సినిమాతో డైరెక్టర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నీ మొదలు పెట్టి మెగాస్టార్, బాలయ్య, వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ అందరితో సూపర్ హిట్స్ తీసిన వినాయక్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సైలెంట్‌గా ఉన్నాడు. చిరంజీవితో తెరకెక్కించిన 'ఖైదీ నెం.150' సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించినా కూడా ఆ సక్సెస్ క్రెడిట్ వినాయక్ కు దక్కలేదు. ఆ సినిమా తర్వాత వినాయక్ ఇంటిలిజెంట్ సినిమాని తెరకెక్కించాడు. కాని ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత మళ్లీ దర్శకత్వం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క హీరో కూడా డేట్స్ ఇవ్వలేదు. ఐతే ఒక్కసారిగా వినాయక్ కి సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సారి వచ్చింది మాత్రం డైరెక్టర్ గా కాదు హీరోగా.


దర్శకులు నటులు అవ్వడం కొత్తేం కాదన్న సంగతి అందరికి తెలిసిందే. కాని వినాయక్ ఏకంగా హీరోగా నటించడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. రీసెంట్‌గా వినాయక్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నరసింహారావు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా కోసం దర్శకుడు వినాయక్ బాగా లావు అయ్యాడు. ఇటీవల ఒక కార్యక్రమంలో వినాయక్ కనిపించాడు. వినాయక్ గతంతో పోల్చితే అయిదు నుండి పది కేజీల వరకు పెరిగినట్లుగా అనిపించాడు. ఇదంతా సినిమా కోసమేనట. 

లావుగా ఉన్న క్యారెక్టర్తోనే ఎక్కువ శాతం షూటింగ్ చేయబోతున్నారని లేటెస్ట్ న్యూస్. ఆ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని వినాయక్ సన్నబడ్డ తర్వాత మరి కొన్ని సీన్స్ తీస్తారట. స్టార్ హీరోలు తమ సినిమాల కోసం లావు అవ్వడం.. సన్నబడటం చేస్తూ ఉంటారు. కాని వినాయక్ మాత్రం మొదటి సినిమాకే చాలా కష్టపడుతున్నాడు. వినాయక్ ను ఇంత కష్టపెడుతున్న దర్శకుడు నరసింహా రావు సినిమాను ఎలా తీస్తాడో అనే ఆసక్తి అందరిలోను ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు కనుక మంచి సబ్జెక్ట్ అయ్యి ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: